12-06-2025 12:44:03 AM
మేడ్చల్, జూన్ 11 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణ కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా సంఘీభావం తెలిపేందు కు మేడ్చల్ జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో బీ. ఆర్. కే భవన్ కు తరలి వెళ్లారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి బి ఆర్ కె భవన్ కు చేరుకున్నారు.
మల్లారెడ్డి వెం ట మేడ్చల్ నియోజకవర్గ నాయకులు భాస్కర్ యాదవ్, ఆకిటి నవీన్ రెడ్డి, నాగరాజు, రాజు కుమార్, మల్లికార్జున స్వామి ఉన్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి వెంట కార్పోరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్దం పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, ఏకే మురుగేష్, అనిల్ కిషోర్, అమీరుద్దీన్, జీకే హనుమంతరావు, చిన్న యాదవ్, లడ్డు నరేందర్ రెడ్డి, హేమంత్ పటేల్, శివ గౌడ్, చిన్నం శ్రీనివాస్, అరుణ్ రావు తదితరులు ఉన్నారు.