12-06-2025 12:44:21 AM
ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్ జూన్ 11: ప్రయాణికులను,విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు, ఆటోలను నడిపే సమయంలో తప్పకుం డా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జి ల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం రోజు జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్ వి, గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదా ల నివారణకు ఆటో డ్రైవర్లకు వనపర్తి సీ ఐ, కృష్ణయ్య, ట్రాఫిక్ ఎస్త్స్ర, సురేందర్ వనపర్తి పట్టణ ఎస్త్స్ర, హరిప్రసాద్, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. . రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అప్పుడే ప్రమాదాల సంఖ్యను త గ్గించగలుగుతామని ప్రజలు, వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.. ఈ కార్యక్రమంలోవనపర్తి సీఐ, కృష్ణయ్య, వనపర్తి పట్టణ ఎస్త్స్ర, హరి ప్రసాద్, ట్రాఫిక్ ఎస్త్స్ర, సురేందర్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.