శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు(BRS MLCs) బుధవారం నిరసన చేపట్టారు. హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్(Kalyana Lakshmi - Shaadi Mubarak) హామీల అమలు చేయాలని నిరసన చేపట్టారు. తక్షణమే తులం బంగారం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బంగారు కబడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇప్పటివరకు పెళ్లయిన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఎమ్మెల్సీల డిమాండ్ చేస్తున్నారు. తులం బంగారం కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారని సూచించారు. సోనియా గాంధీ(Sonia Gandhi), రేవంత్ రెడ్డి.. కల్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.




