17 March, 2026 | 10:18 AM

బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం అసత్య ప్రచారం

14-07-2024 12:22 AM

ఎంపీ సురేష్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): బీజేపీలో.. బీఆర్‌ఎస్ ఎల్పీ ని విలీనం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఆ పార్టీ పార్లమెంటరీ లీడర్ కేఆర్ సురేష్‌రెడ్డి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. మీడియా సాధనాలు తప్పుడు కథనాలతో తమ పార్టీపై బురద జల్లు తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అనంతరం బీఆర్‌ఎస్ నేత వద్దిరాజు మాట్లాడుతూ.. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడంతోపాటు బలహీనపరిచేందుకు మీడియా నిరాధారమైన, వాస్తవ విరుద్ధ్దమైన కథనాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.