28-06-2025 01:32:50 AM
కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): బీఆర్ఎస్ నాయకులకు పని పాట లేక జూరాల ప్రాజెక్టుపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని, జూరాల కూలిపోతుందని అసత్యాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీ మధు సూదన్రెడ్డి మండిపడ్డారు. 30 ఏళ్ల క్రితం జూరాలను నిర్మించింది కాం గ్రెస్ ప్రభుత్వమేననని, ఇప్పటివరకు చెక్కుచెదరలేదని తెలిపారు.
శుక్రవా రం ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి మధుసూదన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.. ప్రాజెక్టుకు సంబంధిం చి 62గేట్లు పనిచేస్తున్నాయని, 8 గేట్లు మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఇప్పటికే నాలుగు గేట్ల మరమ్మతులు పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన నాలుగు గేట్ల రోప్లు మార్చాల్సి ఉందని చెప్పారు.