28-06-2025 01:34:26 AM
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఇనుపరోప్లు తెగిపోయిన నేపథ్యం లో ప్రాజెక్టు భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి శనివారం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు భద్రతపై ఆయన అక్కడ అధికారులతో సమీక్షించనున్నారు.
ప్రాజెక్టుకు ప్రమాదమేమీ లేదు: ఎస్ఈ
జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఇనుప రోప్లు తెగిపోయిన అంశం కరెక్ట్ కాద ని జూరాల ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. ఎనిమిది గేట్లకు సంబంధించిన మరమ్మతులు చేస్తుండగా వరద రావడంతో అడ్డంకిగా మారిందన్నారు. ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని, మరమ్మతులు త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.