24-06-2025 01:01:51 AM
గొడ్డలితో నరికి చంపిన కొడుకు
నిజామాబాద్ జూన్ 23: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటకోట గ్రామంలో గైక్వాడ్ చంద్రకళ (60) అనే మహిళ అర్చకు గురైంది ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికులు వచ్చే సమాచారం అందుకున్న బోధన్ రూరల్ ఎస్త్స్ర మచేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
ఆదివారం రాత్రి చంద్రకళను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు చంద్రకళకు ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నట్టు తెలుస్తోంది వారందరికీ పెళ్లిళ్లు జరిపించడంతో వారంతా మహారాష్ట్రలో జీవనం సాగిస్తున్నారు. మాత్రం ఒంటరిగా ఉంటూనే పెద్ద కురుదులు నివసిస్తుంది. చంద్రకళను కొడుకే గొడ్డలితో నరికినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని బోధన్ రూరల్ సిఐ విజయబాబు తెలిపారు. డబ్బుల విషయం జరిగిన గొడవలో గొడ్డలితో నరికి చంపినట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.