calender_icon.png 24 June, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు రైతుభరోసా సంబురాలు

24-06-2025 12:59:56 AM

  1. మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలి
  2. --  9 రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతులకు అందించాం.. 
  3. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 9రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుభరోసాను ప్రజాప్రభుత్వం ప్రజలకు అందిం చిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కొనియాడారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మండలకేంద్రాల్లో రైతు భరోసా సంబురాలను  నిర్వహించాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. రైతుభరోసా అందించిన వివరాలను ప్రజలకు వివరించాలన్నారు.

సోమవారం గాంధీభవన్‌లో ఈసందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రైతుభరోసా గతంలో రూ.10వేలు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2వేలు కలిపి రూ.12వేలు అందిస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసాను కోటి 49 లక్షల ఎకరాలకు పైగా ఇచ్చినట్లు తెలిపారు. 

సచివాలయం ఎదురుగా విజయోత్సవ సభ: మంత్రి తుమ్మల 

రైతులకు వానాకాలం పంట సాయం కోసం అందించిన ‘రైతు భరోసా ’  విజయా న్ని ప్రజల మధ్య పంచుకునేందుకు ప్రభు త్వం సమాయత్తమవుతోంది. మంగళవారం సాయంత్రం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం ప్రాంగణంలో రైతు భరోసా విజయోత్సవ సభను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

సీఎస్ రామకృష్ణారావుతో కలిసి సోమవారం సభా ప్రాంగణం, నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై పరిశీలిం చారు. సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులకిచ్చిన మా ట ప్రకారం 9 రోజుల్లోనే  రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేశామన్నారు.

సోమవారం 15 ఎకరాల వరకు రూ.513.83 కోట్లను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 67.01 లక్షల మంది రైతులకు రూ.8,284. 66 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్టు ఇంత తక్కువ రోజుల్లోనే రైతుల భరోసా నిధులు జమ ప్రక్రియ పూర్తికావడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని పేర్కొన్నారు.