calender_icon.png 24 June, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటుకు దీటుగా విద్య అందించాలి

24-06-2025 01:04:53 AM

  1. మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి..
  2. విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేత

చిగురుమామిడి, జూన్ 23(విజయక్రాంతి): ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠ శాలలో విద్యార్థులకు విద్యను అందించాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సుందరగిరి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థు లకు చైర్మన్ తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉచిత నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే వి ధంగా పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు బో ధించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. స్పోకెన్ ఇంగ్లిష్,రీడింగ్ కార్నర్, స్పోరట్స్ తో విద్యార్థులకు విద్యనందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోనె శివరాం తెలిపారు.

పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నారని,ఇద్దరూ రెగ్యులర్ ఉపాధ్యాయులు,ఇద్దరు డిప్యూటేషన్ పై వచ్చిన ఉపాధ్యాయులు మొత్తం నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు చెప్పారు.ఈ సంవత్సరం కొత్తగా 17మంది విద్యార్థులు అడ్మిష న్ తీసుకొని పాఠశాలకు వస్తున్నారని సం తోషం వ్యక్త చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గొనె శివరాం ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొడిగె పరశురాములు, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సరళ, మంగలుఉన్నారు.