10-05-2025 04:32:20 PM
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
లక్షెట్టిపేట, విజయక్రాంతి: మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి భవనాల పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాల పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... నేను చదువుకున్న స్కూల్ , కళాశాల భవనాన్ని కట్టించడంనా అదృష్టమని అన్నారు. ప్రభుత్వ కళాశాలను ప్రతి విద్యార్థి వినియోగించుకొని నాణ్యమైన విద్యను పొంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.