20-06-2025 07:08:02 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని ఎం. తుర్కపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పాల సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బుర్ర రాములు వరుసగా నాలుగవసారి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా డైరెక్టర్లుగా బట్టు యాదయ్య, జక్కుల శివయ్యని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల యుగేందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బాలరాజు, బద్దం మల్లారెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, వట్టిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.