calender_icon.png 20 June, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం..

20-06-2025 07:11:44 PM

ఘనంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు..

మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి..

కోదాడ: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూమాటి వర ప్రసాద్ రెడ్డి(Congress Party Mandal President Thumati Varaprasad Reddy) అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గణపవరం గ్రామంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) జన్మదిన వేడుకలు మండల పార్టీ ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని అన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు గణపవరం గ్రామంలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి రెండు రహదారులు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమయ్యాయని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేసి ఎంపీపీని కైవసం చేసుకుంటామని దిమా వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలతోనే కోదాడ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గ్రామాలలో కోట్ల రూపాయల తోటి రహదారులను ఏర్పాటు చేశారని తెలిపారు. ముందుగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామస్తులకు నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లెల రాణి, పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, దేవాలయ చైర్మన్ లక్ష్మారెడ్డి, శేషు,అమర్నేని వెంకటేశ్వరావు, లక్కి వెంకటయ్య, అంబేద్కర్, బెంజమిన్, నారపు రెడ్డి, సుమన్ రెడ్డి, శరభయ్య, బాబ్జీ, గ్రామాశాక నాగ ప్రసాద్, లతీఫ్, బండి చిన కోటయ్య, యూత్ అధ్యక్షులు వెంకట్, ముండ్ర శివరామకృష్ణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.