18-06-2025 06:19:04 PM
మఠంపల్లి: సూర్యపేట జిల్లా(Suryapet District) కోదాడ డిపో నుండి హుజూర్ నగర్, మఠంపల్లి, మట్టపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తంగేడ, దాచేపల్లి, పిడుగురాళ్ళ వరకు బుధవారం నూతనంగా బస్ సర్వీస్ ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలకు సులభంగా ఉంటుందని, అలాగే బస్సు సర్వీసు ప్రారంభించినందుకు కోదాడ డిపో వారికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.