ఎన్నికల వేళ రద్దీకి అనుగుణంగా బస్సులు

09-05-2024 03:04:00 AM

రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు 

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఓటర్ల ను స్వస్థలాలకు తీసుకెళ్లడం మా బాధ్యత అంటున్నాయి ఆర్టీసీలు. ఏపీలో ఓటున్న నగరవాసులు వెళ్లేందుకు సరిపడా బస్సులను నడిపేం దుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ రాజు తెలిపారు. గురువారం నుంచి ఏపీకి రద్దీ ఉంటుందని, శని, ఆదివారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

ఆ రెండు రోజులు సెల వు కావడంతో సీటీ బస్సులను దూరప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాటు చేస్తు న్నామన్నారు. తెలంగాణలో పల్లెలో ఓట్లు ఉన్నవారు ఎన్నికల రోజే అక్కడకు వెళ్లేందుకు తెల్లవారుజాము నుంచి తిరిగి వచ్చేందుకు అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల రవాణ సంస్థల కలిపి రోజూవారీ బస్సులకు అదనంగా 2వేల వరకు బస్సులు నడుపు తున్నామన్నారు. టీఎస్‌ఆర్టీసీతో పాటు, గురువారం నుంచి ఈ నెల 12వరకు రోజు నడిచే 352 బస్సులకు అదనంగా మరో 500 బస్సులు నడుపుతామన్నారు. అదనపు బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. రోజూ నడిచే 3450 బస్సులకు అదనంగా మరో 1000కి పైగా బస్సుల ను సిద్ధంగా ఉంచుతోందన్నారు. 200 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ కిశోర్‌నాథ్ తెలిపారు.