12-01-2025 12:00:00 AM
ఈ మధ్య కాలంలో ప్రజల డిమాండ్ను బట్టి కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నారు. చాలా సంతోషం. అయితే ఆ బస్సులు మూన్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. నాలుగు రోజులు నడిచాక మళ్లీ రావడం లేదు. మన రాష్ట్రంలో ప్రధాన మార్గాల్లో తప్పించి గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ బస్సులు తిరగడం లేదు. డిమాండ్ ఎక్కువ ఉన్న రూట్లలో బస్సులు తిరిగితే ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుతుంది.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్