calender_icon.png 4 February, 2026 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారసంతతో వ్యాపారాలు పెంచుకోవాలి

04-02-2026 01:14:35 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

ఖానాపూర్, ఫిబ్రవరి ౩ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీలో మంగళవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా వారసంత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వారసంతను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని, వ్యాపారాలు పెంచుకోవాలన్నారు. ఈ వారసంత ప్రతి మంగళవారం కొనసాగుతుందని సర్పంచ్ ఏలేటి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

ఈ సంతలో గొర్రెలు, ఎద్దులు, ఆవులు, కోళ్లు, కూరగాయలు, వంటి వ్యాపారాలు చేసుకోవడానికి స్థానికంగా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, సర్పంచి పోలంపల్లి సచిన్, గ్రామ ఉప సర్పంచ్ పెద్దిరాజు ఉన్నారు.

అభ్యర్థులకు బీఫాంల అందజేత

ఖానాపూర్ మున్సిపాలిటీ బరిలో ఉన్న అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండడంతో ఆయా వార్డుల్లో పార్టీ రెబల్సుగా కొందరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే వెడుమా బొజ్జు పటేల్ రెబల్స్ను భుజగించి ఉపసంహరింప చేశారు. ఎట్టకేలకు అభ్యర్థులను ఖరారు చేసి వారికి బీఫాములను అందజేశారు.

ఒకటవ వార్డు నుంచి గొర్రె తిరుమల గంగాధర్, రెండవ వార్డు నుంచి దేవత రాజేశ్వర్, మూడవ వార్డు నుంచి జన్నారపు విజయలక్ష్మి శంకర్ ,నాలుగో వార్డ్ మహేష్ కస్తూరి, ఐదవ వార్డు నుంచి నేత పవిత్ర శ్యామ్ ,ఆరవ వార్డు నుంచి హఫీనా బేగం అమానుల్లా, ఏడవ వార్డు పోలంపల్లి రమేష్ ,8వ వార్డు అస్మత్ జహా షౌకత్ పాషా ,తొమ్మిదవ వార్డ్ చింతపండు లక్ష్మీ రవి, 10 వార్డ్ తొంటి రాధ శ్రీనివాస్, 11వ వార్డు చిన్నం సత్యం రాజురా, 12వ వార్డు లావుడియా లాలు లకు బీఫాంలో అందజేశారు.