12-06-2025 11:17:59 PM
ఎస్టేట్ అధికారులను అడ్డుకున్న వ్యాపారులు..
కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని రైతు బజార్ ఏరియాలో, సింగరేణి స్థలంలో అనుమతి లేకుండా వ్యాపారస్తులు కూరగాయల దుకాణాల కోసం, ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా, నిర్మాణాలు చేపట్టారు. ఈ స్థలము సింగరేణిది అనే బోర్డు పెట్టడానికి, ఎస్టేట్ సెక్యూరిటీ సిబ్బంధి వెళ్లగా బోర్డు పెట్టకుండా వ్యాపారస్తులు అడ్డుకొన్నారు. ఈ సంధర్భంగా ఎస్టేట్ సిబ్బంది వ్యాపారస్తులతో, సింగరేణి స్థలములలో ఎస్టేట్ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్స్ అధికారులు మోహన్ రావు, శ్రీనివాస్, ఎస్&పిసి జూనియర్ ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి, జమేదార్ భాస్కర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.