12-06-2025 11:20:08 PM
సూర్యాపేట (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని త్రివేణి స్కూల్లో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరంను గత నెల ఏడో తారీఖున ప్రారంభించగా గురువారంతో ముగిసింది. దీంతో ఈ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు నల్గొండ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అమిరుద్దీన్(Nalgonda Cricket Association Secretary Syed Amiruddin) సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడల వలన విద్యార్థులకు శారీరక మానసికొల్లాసం కలుగుతుందన్నారు.
కావున పిల్లలు విద్యతోపాటు ఆటలపై ఆసక్తి చూపాలన్నారు. క్రికెట్ చాలామందికి ఇష్టం ఉంటుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్సీ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంపులు ఏర్పాటు చేసి అందరికీ నేర్పించడం జరిగిందన్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోచ్ సయ్యద్ షఫీ, హెచ్సీఏ జిల్లా కోచ్ ఉస్మాత్, టీచర్ జిల్లేపల్లి జానయ్య, త్రివేణి స్కూల్ ప్రిన్సిపల్ హరి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.