14 August, 2026 | 8:12 PM

Breaking News

60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •  

శ్రావణమాసం... కాళేశ్వరంలో భక్తుల సందడి

14-08-2026 07:40 PM

కాళేశ్వరం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదిపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ  కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయ బాలాలయంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరి తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ బాలాలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు భక్తులు కాలసర్ప, శని దోష నివారణ పూజలు నిర్వహించుకుని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మహేష్, చైర్మన్ మోహన్ శర్మ, పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన సేవలను అందించారు.