అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
14-08-2026 07:37 PM
నిర్మల్,( విజయక్రాంతి): నిర్మల్ లో రూ. 13 కోట్లతో చేపట్టి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రోడ్డు విస్తరణ, కొండాపూర్ బ్రిడ్జి నుండి మంచిర్యాల చౌరస్తా వరకు రూ. 13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ కౌన్సిలర్లు గంజి రాజు, సూరి, విఠల్, నరేష్, శశాంక్, ఈశ్వర్ , నాయకులు జుట్టు దినేష్, తో పాటు అధికారులు, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






