31-07-2024 11:18:14 AM
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఎయిర్పోర్ట్లో ఇతర రాష్ట్రాల క్యాబ్లు నడపటంతో ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమంటున్న క్యాబ్ డ్రైవర్లు తేల్చి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్ పోర్టు పోలీసులు ఆందోళన విరమించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎయిర్పోర్టులో భారీగా క్యాబ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగింది.