21-06-2025 08:10:11 PM
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డు దారులకు 3 నెలల రేషన్ ఒకే సారి పంపిణీ చేయాలన్న లక్ష్యం మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ 75 పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్(Additional Collector Ashok Kumar) తెలిపారు. జిల్లాలోని 277 రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడానికి ఇప్పటివరకు 6746.616 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. బియ్యం తీసుకోకుండా మిగిలిన లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తీసుకోవాలని, చౌక దుకాణాల్లో స్టాకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఒకేసారి 3 నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ జూన్, జులై, ఆగస్టు మాసాలకు సంబంధించిన రేషన్ సన్న బియాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ చౌక ధరల దుకాణాల ద్వారా ఈ నెల ప్రారంభించగా జిల్లాలోని 277 రేషన్ షాపుల్లో ఇప్పటి వరకు 6746.616 మెట్రిక్ టన్నులు సన్న బియ్యంను చౌక ధరల దుకాణాల్లో అందుబాటులో ఉంచడం ద్వారా భూపాలపల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డు దారులకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.