13 July, 2026 | 11:56 PM

Breaking News

కొండపాకలోనే యంగ్ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలి   •   గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఐటీడీఏ లక్ష్యం   •   రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో జిల్లా పోలీసుల ప్రతిభ   •   పుల్లూరు బండలో రామయ్య తలంబ్రాల పంపిణి   •   చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి   •   బాలకార్మికుడికి విముక్తి… బడిలో చేర్పించిన సర్పంచ్   •   కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •  

వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి

13-07-2026 09:17 PM

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేటీపీపీలో  కొనసాగుతున్న నిరసన 

గణపురం,(విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు నిర్వహణ విభాగాల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీపీపీలో టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపా రు. వైటీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిం చుకుని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించడంతో పాటు ఉద్యోగుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.