13 July, 2026 | 11:58 PM

Breaking News

కొండపాకలోనే యంగ్ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలి   •   గిరిజన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఐటీడీఏ లక్ష్యం   •   రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో జిల్లా పోలీసుల ప్రతిభ   •   పుల్లూరు బండలో రామయ్య తలంబ్రాల పంపిణి   •   చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి   •   బాలకార్మికుడికి విముక్తి… బడిలో చేర్పించిన సర్పంచ్   •   కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •  

రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి

13-07-2026 09:15 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పంచాయతీలో రామభద్ర ఐటీఐ కళాశాల నుండి గాంధీనగర్ కాలనీ వైపు వెళ్లే 30 అడుగుల రహదారి గుంతలమయంగా మారిందని, సమస్యను పరిష్కరించి నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని బీజేపీ భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కౌన్సిల్ మెంబర్ చుక్కపల్లి బాలాజీ సోమవారం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ గుంతల రహదారి వల్ల వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆ వినతిలో పేర్కొన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా నేటి వరకు పరిష్కారం లభించలేదని, తక్షణమే రహదారిని పరిశీలించి నూతన రహదారి నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.