21 August, 2026 | 12:08 PM

Breaking News

ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ   •   కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో   •   హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్   •   ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు   •   అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   •   హైదరాబాద్‎కు మాజీ సీఎం జగన్.. భారీగా వెలిసిన కటౌట్లు   •   వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, తోరం కట్టే సంప్రదాయం ఇదే!   •   క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం   •   రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో   •   కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు   •  

ఇరిగేషన్ సిబ్బందికి సెలవులు రద్దు

02-09-2024 12:45 AM
  1. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలె 
  2. చెరువులు తెగిన చోట వెంటనే రిపేర్లు 
  3. నిధులు గురించి ఆలోచన చేయవద్దు 
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నీటిపారుదల శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేసిన ట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఏఈల నుంచి సీఈల వర కు క్షేత్రస్థాయిలో ఉండి రెవెన్యూ యంత్రాంగంతో  సమన్వయం చేసుకోవాలని  సూచిం చారు.  చెరువులు, కట్టలు తెగిన చోట తక్షణ మే మరమ్మతులు చేపట్టాలని, విపత్తుల సమయంలో నిధుల గురించి ఆలోచన చేయవద్దని ఉత్తమ్ పేర్కొన్నారు.

ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో డిండి ప్రాజె క్టులో ఆరు ఫీట్ల మేర నీరు చేరిందని, ఆ జిల్లా సీఈ అజయ్ మంత్రి దృష్టికి తీసుకురాగా, ఉదయ సముద్రం నిండేలా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, ఔట్ ఫ్లో 4.70 లక్షల క్యూసెక్కులుగా ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు నీటిని నిలిపివేశారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని పెద్ద దేవులపల్లి రిజర్వాయర్‌కు సాగర్ నుంచి వస్తున్న నీటిని నిలిపివేసినప్పటికి కేవలం వరద నీరే 3 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని వివరించారు. హుజూర్‌నగర్ మండలంలో దెబ్బతిన్న చెరువులు, మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూర్యాపేట జిల్లా సీఈ రమేశ్‌బాబును మంత్రి ఆదేశించారు. 

వరంగల్  జిల్లా కేసముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ను అనుకున్ని ఉన్న చెరువులు దెబ్బతిన్నాయని, అధికారులు మంత్రికి వివరించగా, తక్షణమే మరమ్మతులు చేపట్టాల న్నారు. డ్యామ్‌లు, కెనాల్‌లు, కట్టలపై  దృష్టి సారించి ప్రమాదకర సంఘటలను జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.