27-04-2025 08:24:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిని నిరసిస్తూ ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా(Nirmal District) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ ట్యాంక్బండ్ వద్ద నుంచి ఆడియో వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల సుదర్శన్ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.