కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో పట్టివేత
కామారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): టీ షాప్లో గంజాయి ప్యాకెట్ల పట్టివేత కామారెడ్డిలో కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి రవీందర్ రాజు ఆదేశాల మేరకు ఎక్సైజ్ సిబ్బ ంది పలుచోట్ల దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలోని ఓ టీ పాయింట్ సమీపంలో 7 ప్యాకెట్ల గంజాయి లభించిం ది. దీంతో గంజాయి దందా నిర్వహిస్తున్న కడారి స్వామిపై కేసు నమోదు చేసి, 70 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. స్వా మి అందించిన సమాచారంతో కామారెడ్డి ఎస్హెచ్వో సిబ్బంది తో కలిసి నిజామాబాద్ ఆటోనగర్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఫరీదాబేగం నుంచి 3.48 కిలోల గంజాయి లభించినట్టు తెలిపారు. గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి డీపీఈవో రవీందర్రాజు తెలిపారు.