30 March, 2026 | 12:09 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

చెరువులోకి కారు.. ఐదుగురు జలసమాధి

08-12-2024 01:41 AM
  1. ప్రాణాలతో బయటపడిన మరో యువకుడు
  2. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం వద్ద ఘటన
  3. మృతులు ఎల్‌బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందినవారు

జనగామ, డిసెంబర్ 7 (విజయక్రాంతి): కల్లు కోసం వెళ్లిన యువకుల కారు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు జలసమాధి అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ శివారులో ఈ ఘటన చోటు చేసుకున్నది. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్, వంశీ, వినయ్, బాలు, మణికంఠ స్నేహితులు.

వీరంతా శుక్రవారం అర్ధరాత్రి కారులో బయటికి వచ్చి మద్యం తాగారు. తెల్లవారుజామున ఈత కల్లు కోసం పోచంపల్లికి బయలుదేరారు. వారికి ఆకలివేయగా చుట్టుప క్కల ఏమీ లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంకు వెళ్లారు. మళ్లీ పోచంపల్లికి వస్తుండగా మార్గమధ్యం లో జలాల్పురం చెరువు కట్టపై ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెరువు లోకి దూసుకెళ్లింది.

కారులోని మణికంఠ ఒక్కరే కారు అద్దాలు పగుల గొట్టుకొని బయటపడగా.. మిగతా వారు జలసమాధి అయ్యారు. స్థానికులు గమనించి 100కు డయల్ చేయ గా పోలీసులు అక్కడికి చేరుకుని కారు ను బయటికి తీశారు. అంతకు ముందు వారు జాతీయ రహదారిపై జరిగిన ఒక ప్రమాదాన్ని చూసి అయ్యో అనుకు న్నారు.

ఆ తర్వాత  వారు కూడా మృత్యువాత పడ్డారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా పాతికేళ్ల వయస్సు లోపు వారేనని పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో ఎల్‌బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.