06-02-2026 01:42:53 AM
భీమదేవరపల్లి ,ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి యాజకురాలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది ఎల్కతుర్తి గ్రామంలో సుమారు 8 సంవత్సరాలుగా వృద్ధురాలు బస్టాండ్ సమీపంలోని దుకాణాలు హోటల్లో అడుక్కుతింటూ జీవనం కొనసాగించేదని స్థానికులు తెలిపారు.
వృద్ధురాలు తెలుపు రంగు జుట్టుతో నారింజ రంగు చీర కలిగి ఉందని ఎల్కతుర్తి ఎస్త్స్ర ప్రవీణ్ కుమార్ తెలిపారు వృద్ధురాలి పూర్తి వివరాలు తెలియలేదన్నారు. ఎవరైనా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ నెంబర్ 8712 68 50 13కి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.