16-12-2025 09:58:08 PM
* ఓటర్లకు డబ్బులు పంచిన ఇద్దరిపై కేసు..
* సీఐ గురు స్వామి వెల్లడి..
బోథ్ (విజయక్రాంతి): మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బోథ్ పంచాయతీలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కొందరు అభ్యర్థులు డబ్బును, మద్యం పంచుతూ, ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేసినట్లు బోథ్ సీఐ గురుస్వామి తెలిపారు. ఫిర్యాదుదారు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో సర్పంచ్ అభ్యర్థి కుర్మె అన్నపూర్ణ మహేందర్ అనుచరులైన గొర్ల గంగయ్య, గొర్ల లక్ష్మన్ ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదుదారుకు 500 రూపాయల నగదు, పోటీ చేస్తున్న అభ్యర్థి బ్యాలెట్ పేపర్ నమూనాను ఇచ్చి ఓటర్ ను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడంతో ఈ ఇద్దరితో పాటు పోటీ చేస్తున్న అన్నపూర్ణ మహేందర్ లపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఓటు హక్కును నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజలు వినియోగించుకునేందుకు ఎలాంటి ప్రలోభాలు చేయకూడదని తెలిపారు. డబ్బు, మద్యం, బహుమతులు లాంటివి పంచే క్రమంలో ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని సూచించారు.