09-06-2025 05:22:29 PM
నిర్మల్ (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory)కి వ్యతిరేకంగా వార్తలు రాసిన పత్రికలపై అక్కడి పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని నిర్మల్ పాత్రికేయులు(Nirmal journalists) డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ పట్టణంలో కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav)కు టియుడబ్ల్యూయు(ఐజేయు) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
అనంతరం జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్యలు మాట్లాడుతూ... పర్యావరణనికి, జలకాలుష్యనికి కారణమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలను ప్రచురిస్తే జీర్ణించుకోలేని ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు పిర్యాదుతో స్థానిక పోలీసులు కక్ష పూరీతంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమయంలో జనంసాక్షి ఎడిటర్ రహిమాన్ పై అక్రమంగా కేసులు బనాయించడం సరైంది కాదని, అది ముమ్మాటికి ప్రశ్నించే వారి గొంతు నొక్కడిమేనని మండిపడ్డారు.
ఎడిటర్ పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పూసల పోశెట్టి, గుమ్ముల అశోక్, యోగేష్ శర్మ, కూన రాజు, కైలాష్, రామొల్ల రాజేశ్వర్, జల్డ మనోజ్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.