09-06-2025 05:15:10 PM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన భూభారతి-2025 రెవెన్యూ చట్టం ప్రకారం భూ సమస్యలను పరిష్కరించడానికి గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలోని బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల్లోని గొల్ల చర్ల ముల్కనూరు కొత్తపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భూభారతి చట్టం గ్రామ సమస్యలకు పరిష్కారం చూపుతుందని, ఈనెల 20 వరకు నిర్వహించే సదస్సులను వినియోగించుకొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్లు నాగరాజు, ఇమ్మానియేల్, శారద ఉన్నారు.