లోక్ అదాలత్ లో 617 కేసులు పరిష్కారం
చేవెళ్ల: జాతీయ న్యాయ సంస్థ అదేశాల మేరకు చేవెళ్ల కోర్టు(Chevella Court)లో జూన్ 9 నుంచి 11 వరకు నిర్వహించిన లోక్ అదాలత్(Lok Adalat)లో 617 కేసులు పరిష్కరించి రూ. 11,19,850 జరిమానా విధించామని చేవెళ్ల సీనియర్ న్యాయ మూర్తి దశరథ రామయ్య(Senior Justice Dasharatha Ramaiah) తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 14 వరకు లోక్ అదాలత్ కొనసాగుతుందని, ఆ లోపు డ్రంకన్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, ఇతర సివిల్, క్రిమినల్ తగాదాలు ఉన్న వాళ్ళు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి కొత్త రవి,స్పెషల్ రిటైర్డ్ న్యాయమూర్తి కే లక్ష్మన్, చేవెళ్ల ట్రాఫిక్ సి ఐ వెంకటేశం, చేవెళ్ల ఎస్ హెచ్ ఓ భూపాల్ శ్రీధర్, శంకరపల్లి ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ గౌడ్, షాబాద్ ఎస్ హెచ్ ఓ కాంతా రెడ్డి, మొకిల ఎస్ హెచ్ ఓ వీర బాబు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.






