1 April, 2026 | 1:38 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

ఎన్నికల నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి

29-11-2025 07:40 PM

• మద్యం అమ్మకాలపై నిఘా 

•  బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహించడం, అనధికారిక మద్యం విక్రయాలు జరపడం పూర్తిగా నిషేధించబడిందని గరిడేపల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చలికంటి నరేష్ తెలిపారు. అధికారికంగా ఉన్న మద్యం షాపులు కూడా నిర్ణయించిన సమయాల్లో మాత్రమే పనిచేయాలని, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపేలా అక్రమంగా మద్యం సరఫరా లేదా పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.

గ్రామాలు,వాడలు,కాలనీలు,ప్రధాన రహదారులపై ప్రత్యేక నిఘా టీంలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ పెంచినట్లు తెలిపారు. ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బెల్ట్ షాపులు నిర్వహించడం,గోప్యంగా మద్యం అమ్మడం, నిల్వ ఉంచడం వంటి ప్రయత్నాలు చేస్తే వారిపై చట్టరీత్యా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో శాంతి భద్రతను నిలబెట్టడం కోసం పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నియమాలను అందరూ గౌరవించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.