సిద్దిపేట జిల్లాలో నగదు పంపిణీ కలకలం
సిద్దిపేట, మే 12 (విజయక్రాంతి): ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లాలో నగదు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం కలకలం రేపింది. సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ నాయకుడు జువ్వాన్న కనకరాజు ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు ఓ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆదివారం పెద్ద సంఖ్య లో పోలీసులు కనకరాజు ఇంటిని చుట్టుముట్టి ఇంట్లో సోదాలు చేశారు. సుమారు మూడు గంటల పాటు సోదాలు చేసిన పోలీసులకు రూ.230 నగ దు మాత్రమే లభించిందని అధికారులు వెల్లడించారు. సిద్దిపేట పట్టణంలోని 39వ వార్డులో నివాసం ఉంటున్న రత్నం అనే బీ జేపీ నాయకుని ఇంట్లో సుమారు రూ.లక్ష వి లువ గల మద్యం పోలీసుల సోదాలలో బ యటపడింది. ఐదు మద్యం కాటన్లను స్వాధీ నం చేసుకొని రత్నంపై కేసు నమోదు చేసిన ట్లు సిద్దిపేట వన్టౌన్ పోలీసులు తెలిపారు.
దుబ్బాకలో..
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలో బీఆర్ఎస్ కార్యకర్త దివిటి సాయికుమార్ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు అనుమానించిన మరో పార్టీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సాయికుమార్ నుంచి రూ.11,500 నగదు, ఓటరు లిస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.




