17 April, 2026 | 10:35 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

విద్యుత్ షాక్‌తో పశువు మృతి

17-04-2026 09:06 PM

చివ్వెంల: మండల పరిధిలోని పాచ్చనాయక్ తండాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పశువు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు ధరావత్ శంకర్‌కు చెందిన పశువు పొలంలో మేత మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్‌కు సమీపంలో ఉన్న విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వద్ద భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు విద్యుత్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశువు మృతితో సుమారు రూ.50 వేల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.