మచ్చరామిలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి
24-03-2026 12:00 AM
విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన ఉప్పు లక్ష్మి
సుల్తానాబాద్ మార్చి 23 (విజయ క్రాంతి): ప్రభుత్వ విప్పు , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మండలం మంచరామి గ్రామ సర్పం చ్ ఉప్పు లక్ష్మీ తెలిపారు,
ఈ క్రమంలో రూ. 5 లక్షల వ్యయంతో జిపి రోడ్డునుంచి కత్తెర్ల గట్టయ్య ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం సోమవారం పూర్తి చేసుకోవడం జరిగింది అ న్నారు, ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పు లక్ష్మీ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప స ర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




