25-06-2025 12:51:38 AM
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
కరీంనగర్ క్రైం, జూన్24(విజయక్రాంతి) : తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు విజయోత్సవాలు ఎలా జరుపుకుంటుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ మూడు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టినందుకా?, సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందిస్తానని ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు ప్రతి సంవత్సరానికి 15000 ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలు జరుపుతున్నారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో 600 మంది రైతులు చనిపోయారని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రైతాంగానికి భరోసా కల్పించిన మహానేత కేసిఆర్ అంటూ కొనియాడారు. దమ్ముంటే కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. కరీంనగర్ అభివృద్ధికి ఒక్క పైసా అయిన తీసుకువచ్చావా అంటూ బండి సంజయ్ ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ తోపాటు చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.