calender_icon.png 25 June, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసాతో రైతుల ముఖాల్లో ఆనందం

25-06-2025 12:50:32 AM

ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు 

బాన్సువాడ జూన్ 24 (విజయ క్రాంతి) :  రైతు భరోసా సాయంతో రైతుల ముఖాల్లో ఆనందం విరబోసిందని రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు.బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో భరోసా సాయం అందజేసినందుకు మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఎఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా సాయం అందడం ద్వారా రైతుల ఇండ్లలో ఆనందం వెళ్లి విరిసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి 12,000 అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిధాన్నారు.

ఈ  కార్యక్రమములో   మైనారిటీ  జిల్లా  అధ్యక్షులు ఖలేఖ్   అంజి  రెడ్డి  ,హన్మాండ్లు  , నర్సన్న  , అజీమ్  , నార్ల  సూరి  , మాజీ  ఎంపీపీ  ఎజాస్  , బాబా  , హకీమ్  , మొయిన్ ,  పిట్ల  శ్రీధర్  , అమర్  , వాహబ్  , రాయిస్ , రాజేష్  , శ్రీనివాస్  ,డైరెక్టర్  సాయిలు , రఫీ , పోత్ రెడ్డి  , మోహన్  నాయక్  ,   దాసరి  శ్రీను  , నారాయణ  ,తదితరులు  నాయకులూ  పాల్గొన్నారు