18-07-2025 12:56:32 AM
హోంగార్డులను అభినందించిన ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, జూలై 17 (విజయ క్రాంతి) కామారెడ్డిజిల్లానుండి మొదటి సారి ప్రతిష్టాత్మకమైన ముగ్గురు హోంగార్డులకు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి. ఇద్దరికీ కేంద్ర ఉత్కృష్ట సేవ పతకాలకు, ఒకరికి అతి ఉత్కృష్ట సేవ పతకానికి ఎంపికయ్యారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పథకాలను ప్రకటించడం జిల్లాకు గర్వకారణంగా ఉందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. విలువైన ప్రాణాలను కాపాడినందుకు హోంగార్డులకు ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక చేశారన్నారు.
ప్రాణాలను కాపాడిన మూడు నెలల లోపే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్కృష్ట పోలీస్ పతకాలను జిల్లాలోని ఇద్దరు హోంగార్డులు అందుకున్నారు. జిల్లా హోంగారడ్స్ లను ఎస్పీ అభినందించారు. 31 సం.ల నిబద్ధత కలిగిన విధులకు ఒకరికి అతి ఉత్కృష్ట సేవా పతకo. లభించిందని ఆయన పేర్కొన్నారు. ఉత్కృష్ట , అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికైన హోంగారడ్స్ ను ఎస్పీ ఎం రాజేష్ చంద్ర అభినందించారు.
ఉత్కృష్ట సేవా పతకo:
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చెరువులోకి దూకి చెరువు మద్యలోకి వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళను సురక్షితంగా రక్షించిన పిట్లం బ్లూ కోర్ట్ హోం గార్డు ఎస్. మారుతి, కామారెడ్డిలో రైల్వే ట్ప్రా ఆత్మహత్యయత్నం చేసిన మహిళను సమయస్ఫూర్తితో కాపాడిన హోం గార్డు వసంత్.అతి ఉత్కృష్ట సేవా పతకo నిబద్ధతతో గత 31 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందిస్తు స్పెషల్ బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ డి. మల్లికార్జున్ ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని హోంగారడ్స్ సేవలను గుర్తించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పతకాలను ప్రకటించడం జిల్లాకు గర్వకారణం. ఇది పోలీస్ శాఖలో సేవా తత్పరతకు ప్రతీకగా నిలుస్తోంది అని తెలిపారు.
అదే విధంగా, హోంగార్డు సేవలో ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా ఉత్తమ సేవలు అందిస్తున్న వారితో పాటు, ప్రజల ప్రాణాలను రక్షించిన వారికి ఈ పతకాలు ప్రతి సంవత్సరం ప్రోత్సాహకంగా ఇవ్వబడతాయని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, తెలిపారు. జిల్లాలో ఉన్న హోంగార్డులు తమ సేవలో నిబద్ధత, విశ్వసనీయత చూపించి, ఇలాంటి గౌరవ పతకాలు మరెన్నో అందుకునేలా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు.