07-06-2025 08:32:35 PM
బీజెపీ శ్రేణులకు ఎంపీ నగేష్ పిలుపు...
అదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్(MP Godam Nagesh) అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యక్రమంలో 11 ఏళ్ల జిల్లా కార్యశాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జిల్లా ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ మేరకు నాయకులనుద్దేశించి ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. గతంలో మాజీ ప్రధాని స్వర్గీయ వాజపేయి కాలంలో 2 లైన్ ల జాతీయ రహదారులను, 4 లైన్ లుగా మార్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ పాలనలో గోదావరిఖని, కరీంనగర్ రహదారి, బోరజ్ ఉపాస్ నాల రహదారి, కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనాలు, పాస్పోస్ట్ కార్యాలయం, ఇటీవల రైల్వే లైన్, ఎయిర్పోర్ట్ ఏర్పాటు కు అనుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి వివరిస్తే వచ్చే స్థానిక సంస్థల్లో మనం సత్తా చాటగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బ్రహ్మనంద్, జిల్లా, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.