07-06-2025 08:30:18 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండల కేంద్రానికి చెందిన పేదింటి వివాహానికి చేగుంట తాజా మాజీ ఎంపిపి మాసుల శ్రీనివాస్(Former MPP Masula Srinivas) పట్టణ కేంద్రానికి చెందిన ఆయిళ్ల పోచమ్మ కూతురు శ్రావణి వివాహానికి 5,000/- రూపాయలు ఆర్థిక సాయం అందచేశారు. ఈ సందర్భంగా మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ... పట్టణ కేంద్రంలో ఎవరికి ఆపద వచ్చిన తన వంతు సహాయంగా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని, తనను కలవడానికి ఏ రాత్రి వచ్చిన ప్రజల కోసం తలుపు తెరిచే ఉంటాయని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లబోయిన ముత్యాలు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.