calender_icon.png 13 June, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర పథకాలే ఆధారం

12-06-2025 11:34:25 PM

కేంద్ర మోదీ పథకాలతో లక్షల మందికి లబ్ధి..

టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదు..

మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు.

ఖమ్మం (విజయక్రాంతి): గత పదకొండు సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పోషించిన పాత్ర అపూర్వమని, రాష్ట్రాన్ని ముందుకు నడిపిన ప్రతి ఘట్టానికీ కేంద్ర పథకాలే ఆధారం అన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబన్న(Ande Babanna), ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు(District BJP president Nelluri Koteswara Rao) స్పష్టంగా పేర్కొన్నారు. గురువారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన వారు, కేంద్ర ప్రధానమంత్రి  నరేంద్రమోదీ నాయకత్వంలో అమలవుతున్న పథకాలు లక్షలాదిమందికి నేరుగా లబ్ధిని అందించాయని తెలిపారు.

రాష్ట్రంలోని టీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో స్పష్టమైన అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్రంలోని 31 లక్షల 30 వేల అర్హులైన రైతుల్లో 31 లక్షల 20 వేల మందికి నిధులు బదిలీ చేయబడినట్లు పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 99 శాతం నిధుల బదిలీ విజయవంతంగా జరిగిందన్నారు. ఇదే విధంగా, పీఎం ముద్రా యోజన ద్వారా 2017 నుంచి 2024 వరకు 75 లక్షల రుణ ఖాతాలు మంజూరై, 72 వేల కోట్ల విలువైన రుణాలు మంజూరు చేయబడ్డాయి. ఈ పథకాలు గ్రామీణ యువతలో స్వావలంబనకు బీజం వేశాయని అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన గడిచిన 10 ఏళ్లలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ ప్రజలకు మేలు జరిగినట్లు కనిపించడంలేదని విమర్శించారు. అభివృద్ధి కేవలం కేంద్ర పథకాలతోనే సాధ్యమైందని, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు గోంగూర వెంకటేశ్వరరావు, నున్న రవికుమార్, అల్లిక అంజయ్య, గంట్యాల విద్యాసాగర్, ఉప్పల శారద, వాకదాని పుల్లారావు, గుత్తా వెంకటేశ్వర్లు, అత్తి విజయ రెడ్డి, రవి రాథోడ్, తిరుమల పల్లి విజయరాజు, కోటమర్తి సుదర్శన్, గుగులోతు నాగేశ్వరరావు,భూక్య శ్యాంసుందర్, బోయినపల్లి చంద్రశేఖర్, ఈదుల వీరభద్రం హాజరయ్యారు.