12-06-2025 11:36:57 PM
ఖమ్మం (విజయక్రాంతి): గురువారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) ఖమ్మం నగరంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, వరద నీటి కాల్వ, రోడ్డు వెడల్పు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరద కాలువ వైడనింగ్ పనులు సి.ఆర్.జి. టవర్స్ దగ్గర పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. లకారం చెరువు, అల్లిపురం రోడ్డు గంగమ్మ తల్లి టెంపుల్ వద్ద కూడా కాల్వ పనులను మంత్రి తనిఖీ చేశారు.
గంగమ్మ తల్లి దేవాలయం వద్ద కాల్వ ఆక్రమణ జరిగిందని వచ్చిన ఫిర్యాదుకు మంత్రి స్పందిస్తూ రెవెన్యూ అధికారులు టోపో మ్యాప్ ప్రకారం ఆక్రమణలను చెక్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఆర్డీవో నర్సింహారావు, మునిసిపల్ ఇంజినీరింగ్ ఖమ్మం డివిజన్ కార్య నిర్వాహక ఇంజనీర్ వి. రంజిత్, సంబంధిత అధికారులు, కార్పోరేటర్ లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.