15 March, 2026 | 9:09 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సెంచరీల మోత రంజీ ట్రోఫీ

07-11-2024 12:12 AM

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో భాగంగా మూడో రౌండ్ మ్యాచ్‌లు బుధవారం ప్రారంభమయ్యాయి. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు అయ్యర్ (152*) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జమ్ముతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మేఘాలయ 73 పరుగులకే చాపచుట్టేసింది.  ఆకిబ్ నబీ, ముస్తాక్ చెరి ఐదు వికెట్లతో చెలరేగారు. వివిధ జట్ల ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగారు. ఉత్తరాఖండ్ ఆటగాడు ప్రియాంషు (107*), మధ్యప్రదేశ్ ఆటగాళ్లు కెప్టెన్ శుభమ్ శర్మ (134*), వెంకటేశ్ అయ్యర్ (118*), ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ (121), బెంగాల్ కెప్టెన్ మజుందార్  (101), ముంబైలో అయ్యర్ (152*), సిద్దేశ్ లాడ్ (116*) సెంచరీల మోత మోగించారు.