యాదాద్రిభువనగిరి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం భువనగిరి ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటేనే బొందల గడ్డ పార్టీ అని ఘటుగా వివర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు నియంతృత్వ పాలన కొనసాగించిన ఏకైక పార్టీ ఎద్దెవా చేశారు.