రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

25-04-2024 01:37:16 AM

వరంగల్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. వర్దన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామ శివారులో  ప్రైవే ట్ బస్సును ఓ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులను ఇల్లంద గ్రామానికి చెందిన కాశిమల్ల వరుణ్ తేజ, మల్లెమాక సిద్దు, గణేశ్, పొన్నాల అనిల్ కుమార్‌గా గుర్తించారు. ఒకేరోజు గ్రామానికి చెందిన నలుగురు  దుర్మరణం చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి .