కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
10-05-2026 01:59 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ నగరంలోని ములుగు రోడ్డులో గల మాలిక్ కియా షోరూంలో కియా సంస్థ రూపొందించిన సరికొత్త మోడల్ 'కియా సైరోస్' కారును హనుమకొండ డీసీసీ అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇనగాల కారు ఫీచర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, గరిష్ట భద్రతా ప్రమాణాలతో కూడిన వాహనాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు. కియా సైరోస్ కారు వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నవీన్, మహేష్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.






