మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు
10-05-2026 12:44 PM
కేసముద్రం,(విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్న బహిరంగ సభకు కేసముద్రం ప్రాంతం నుండి ప్రత్యేక రైలులో భారతీయ జనతా పార్టీ నేతలు తరలి వెళ్లారు. విజయవాడ నుండి సికింద్రాబాద్ వరకు ఆదివారం ప్రవేశపెట్టిన ప్రత్యేక రైలులో వివిధ ప్రాంతాల నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్లారు. ఇందులో కార్యకర్తలకు నాయకులకు భోజన వసతి కూడా కల్పించారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం రైల్వే స్టేషన్ల నుండి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు.






