29-06-2025 07:25:09 PM
చండూరు (విజయక్రాంతి): తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(Telangana Municipal Workers and Employees Union) చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులుగా బిపంగి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఇరిగి యాదగిరిని ఇటీవల చండూరు మండల కేంద్రంలో సిఐటియు మునుగోడు జనరల్ బాడీ విస్తృత స్థాయి సమావేశంలో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని వారన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని వారన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వారి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ ల ను ముందుకు తెచ్చిందని వారన్నారు. దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని, ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.